Wednesday, May 2, 2012

పాటలపనిలో ‘రుద్రాక్షపలి’


పాటలపనిలో ‘రుద్రాక్షపలి’
సడన్‌గా దేవుడు ప్రత్యక్షమైతే మనిషి గుండె ఆగిపోతుంది. అలాగే సడన్‌గా దెయ్యం కనిపిస్తే... అప్పుడు కూడా సేమ్ టు సేమ్. ఇదే అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని బ్లూకింగ్ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్.ఎల్.ఎస్.వి.ప్రసాదరావు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపల్లి’. ఈ సినిమా పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని అర్జున్ సంగీత దర్శకత్వంలో రికార్డ్ చేశారు. కేదార్‌నాథ్ పరిమి, రాణీ పులోజమాదేవి గీత రచయితలు.

దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రతి రోజూ ప్రతి మనిషికీ తన దైనందిన జీవితంలో జరిగే సహజ సంఘటనలను తీసుకుని ఉత్కంఠభరితంగా చూపించే ప్రయత్నమే ఈ సినిమా. పాత, కొత్త నటీనటులతో పాటుగా ఓ పెద్ద హీరో నటిస్తారు. మే రెండో వారంలో పాటలను చిత్రీకరిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.సేనా పతి.